Sunday, 22 November 2015

విపత్తుల యందు రామ మంత్రం

రామయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే !
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః !!
రాముణ్ణి ఏమని పిలిచేవారు:
అయోధ్యలో ఉన్న రాముణ్ణి, దశరథ కౌసల్య సుమిత్ర కైకమ్మలు 'రామ!' అని పిలిచేవారు.
మంత్రులు 'రామభద్రా!' అని సంబోధించేవారు.
అయోద్య ప్రజలు 'రామచంద్రా!' అని ,
రాముని చిన్నప్పటినుండీ ఎత్తుకు మోసి సేవచేసిన దాదులు 'రఘునాథా!' అని ,
సీతమ్మ మాత్రమే 'నాథా!' అని రామ చంద్రుణ్ణి గౌరవపూర్వకంగా పిలుస్తూoడేవారు.
మిథిలా నగరంలో వున్న వారు మాత్రం శ్రీరాముణ్ణి 'సీతాపతీ!' అనే పలకరిస్తూoడేవారు.

ఈ నామాలను నిత్యం పఠిచడం వల్ల దుస్కరమైన సంసార బంధాల నుండి విముక్తి పొంది మోక్షము పొందుతారు.     ( పద్మపురాణము)

పై మంత్రమును వేకువ జామున లేచి స్నానము చేసి 108 పూసల జపమాలను తీసుకొని  108 సార్ల చొప్పున 7 సార్లు జపించవలను . అలా ఒకసారి జపించిన తరువాత గుగ్గిలము అగ్నిలో వేసి హోమము చేయ్యాలి.
పైన చెప్పినట్టు 7 సార్లు ఆచరించి ఆ హొమబస్మమును భద్రపరిచి ప్రతి రోజు ధరించాలి. కార్యసిద్ది కై వెళ్ళినపుడు తప్పకుండా ధరిస్తే ఆ కార్య మార్గము సులభతరమై విప్పత్తులన్నీ పోవును.

No comments:

Post a Comment